రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

31 May, 2017 12:57 IST|Sakshi
వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం ఈ రోజే ప్రారంభమైంది. 
మరిన్ని వార్తలు