ఓట్ల కోసం మా ఊరికి రావొద్దు

21 Oct, 2018 01:44 IST|Sakshi
ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేస్తున్న గ్రామస్తులు

ముజాహిదిపురం గ్రామస్తుల వినతి 

తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ముజాహిదిపురం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. తమ గ్రామానికి ఏ పాలకుడూ ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు నది పక్కనే ఉన్నప్పటికీ గ్రామంలోని చెరువు ఎడారిలా మారిందని, మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందుతున్నా.. తాము గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్నామని పేర్కొన్నారు.  తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడం చేతకానప్పుడు ఓటు అడిగే హక్కు లేదని నినదించారు.  

మరిన్ని వార్తలు