సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతున్నా ప్రధాని మోదీ మాత్రం దాన్ని చక్కదిద్దడం కంటే ఆవులపై ప్రేమనే ఒలకబోస్తున్నారని ఎంఐఎం అధ్యక్షు డు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో జాతీయ మీడియాతో మాట్లాడారు. రూపాయి విలువ పతనమవుతున్నా.. మోదీ ఆవుల విషయంలో ఓ మతానికి అనుకూలంగా మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తున్నారని పేర్కొన్నారు.