తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లకు అదనంగా కీలక ప్రకటనలు
ఉద్యమ అమరుల కుటుంబాలకు రూ. 25 వేల పింఛన్, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
ఆడపిల్లల వివాహం కోసం రూ.లక్ష ఆర్థిక సాయం, తులం బంగారం
రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఆర్థిక సాయం. కౌలు రైతులకూ ఈ పథకం వర్తింపు రైతు కూలీలకూ ఏటా రూ.12 వేలు ఆర్థిక సాయం
ఉద్యోగుల సీపీఎస్ రద్దు.. వెంటనే పీఆర్సీ, డీఏ బకాయిలు
200 యూనిట్లలోపు వాడే వారికి కరెంటు ఫ్రీ
ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామ వలంటీర్ల వ్యవస్థ
బీసీలకూ సబ్ప్లాన్.. క్రీమీలేయర్ ఎత్తివేతపై కేంద్రానికి సిఫార్సు
అనుబంధ మేనిఫెస్టోలో జాబ్ కేలండర్.. కేడర్ల వారీగా పోస్టుల భర్తీకి తేదీల ప్రకటన
బీఆర్ఎస్ పాలనలో అవినీతి ఆరోపణలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలు, రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ డిక్లరేషన్లతోపాటు పలు కీలక హామీలతో ‘అభయ హస్తం’ పేరిట ప్రణాళికను ప్రజల ముందు పెట్టింది. సుపరిపాలన అందిస్తామంటూ ప్రారంభమైన ఈ 42 పేజీల మేనిఫెస్టోలో మొత్తం 37 విభాగాల్లో పెద్ద ఎత్తున హామీలను గుప్పించింది.
తమకు అధికారమిస్తే ప్రజల ఆకాంక్షల మేరకు పూర్తిస్థాయి ప్రజాస్వామిక పాలన తెస్తామని, ప్రతిరోజూ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని పేర్కొంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ప్రజా దర్బార్లు నిర్వహిస్తారని తెలిపింది. బీఆర్ఎస్ పాలనలోని అవినీతి, కుంభకోణాల ఆరోపణలపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని.. కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించింది.
గ్రామ వలంటీర్ల వ్యవస్థ తెస్తాం..
ప్రజా ఫిర్యాదుల కోసం టోల్ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపింది. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. 2030 నాటికి తెలంగాణను 500 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, ఇండ్రస్టియల్ కారిడార్లు, ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఉపాధి హామీ పనిదినాలను, వేతనాలను పెంచుతామని తెలిపింది.
ఉచితంగా కరెంటు..
200 యూనిట్లలోపు వాడే వినియోగదారులందరికీ ఉచిత కరెంటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా సాధిస్తామని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని తెలిపింది. చెరువుల మరమ్మతు, నిర్వహణ బాధ్యతలను నీటి సంఘాలకు అప్పగిస్తామని వెల్లడించింది. ఆదర్శ రైతు విధానాన్ని పునరుద్ధరిస్తామని.. ధాన్యం కొనుగోళ్లలో తేమశాతం పేరిట తరుగు తీసే విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించింది. పాల ఉత్పత్తిదారులకు లీటర్కు రూ.5 ప్రోత్సాహకం ఇస్తామని వివరించింది. నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను వంద రోజుల్లో తొలగిస్తామని హామీ ఇచి్చంది.
సంక్షేమం కోసం మరెన్నో..
విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచుతామని.. పీఈటీ పోస్టులు భర్తీ చేసి ఏటా క్రీడా పోటీలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. అన్ని జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, నియోజకవర్గంలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ, మున్సిపాలిటీల్లో 100 పడకల ఆస్పత్రులను నిర్మిస్తామని తెలిపింది. రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని, రేషన్షాపులను మినీ సూపర్మార్కెట్లుగా మార్చుతామని ప్రకటించింది. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని, సమ్మక్క జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తామని హామీ ఇచ్చింది.
బీసీలకు క్రిమీలేయర్ విధానాన్ని తొలగించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని తెలిపింది. చేనేత ఉత్పత్తులను ఈ–కామర్స్తో అనుసంధానం చేస్తామని, రిటైరైన జర్నలిస్టులకు పింఛన్ సదుపాయం కల్పిస్తామని పేర్కొంది. హైదరాబాద్ నగరాన్ని ముంపు రహిత నగరంగా తీర్చిదిద్దుతామని.. అన్ని నగరాలు, మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి 25 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించింది. ఎల్బీనగర్–బీహెచ్ఈఎల్ రూట్లలో కొత్త మెట్రో లైన్లను నిర్మిస్తామని తెలిపింది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని కీలక అంశాలివీ..
రైతులు – భూములు
గౌరవ వేతనాలు పెంపు
యువత – నిరుద్యోగులకు..
విద్యార్థులకు..
ప్రభుత్వ ఉద్యోగులకు..
మహిళలకు..
ఆరోగ్యం
సంక్షేమ రంగం
ఉద్యోగాల భర్తీకి జాబ్ కేలండర్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను పబ్లిక్ సరీ్వస్ కమిషన్, స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాల మిషన్ ద్వారా చేపడతామని అనుబంధ మేనిఫెస్టోలో పేర్కొంది. దరఖాస్తుదారులెవరూ ఒక్క రూపాయి ఫీజు కట్టనవసరం లేదని తెలిపింది. ఏయే కేడర్ ఉద్యోగాల భర్తీకోసం ఏ తేదీన నోటిఫికేషన్లు ఇస్తామనే వివరాలనూ పేర్కొంది. కొన్ని ఉద్యోగాలను ఒకే దశలో, మరికొన్ని ఉద్యోగాలను రెండు దశల్లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో ప్రకటించిన నోటిఫికేషన్ తేదీలివీ..
కులాలు–రిజర్వేషన్లు