టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికలు

13 Apr, 2017 15:49 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికలు

హైదరాబాద్‌సిటీ: టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరిస్తామని టీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. ఏప్రిల్‌ 18వ తేదీ దాకా నామినేషన్లను స్వీకరిస్తారు. 19 న నామినేషన్ల పరీశీలన జరుగుతుంది. 20వ తేదీ ఉపసంహరణకు చివరి రోజు. 21న కోంపల్లిలో ప్లీనరీ నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ అధ్యక్ష ఎన్నికల అధికారి నాయిని నరసింహ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి , మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు.

మరిన్ని వార్తలు