విద్యుదాఘాతంతో కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

21 May, 2015 12:49 IST|Sakshi

హైదరాబాద్: కరెంటు స్తంభం ఎక్కి పనిచేస్తుండగా షాక్‌తో వెంకటా చారి అనే కాంట్రాక్ట్ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన నగరంలోని అజాంపూర డివిజన్ కాలాడేర బస్తీలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. అయితే తీవ్రంగా గాయపడటంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి వద్ద విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

మరిన్ని వార్తలు