సాక్షి, సిర్పూర్ కాగజ్నగర్: ఇంకా ఎన్ని రోజులు మా పనులన్నీ వదులుకొని యూరియా కోసం లైన్లు కట్టాలి.. మా పంటలు ఏం కావాలని కొమురం భీం(ఆసిఫాబాద్) జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతును రైతలు నిలదీశారు. ఆయన సోమవారం యూరియా పరిస్థితిని పరిశీలించేందుకు కాగజ్నగర్లో పర్యటించారు. ఈ సందర్భంలో రైతులు తమకు యూరియా అందే వరకు కదలనివ్వమని కలెక్టర్ వాహనం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు తమకు గత వారం రోజులుగా యూరియా అందటం లేదని.. తీవ్ర కొతరను ఎదుర్కొంటున్నామని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదురుగా నిత్యం పడిగాపులు కాస్తున్నామని కలెక్టర్కు దృష్టికి తీసుకువచ్చారు. యూరియా నిల్వలు పెంచాలని రైతులు కలెక్టర్ను కోరారు.