రాష్ట్ర సగటును మించి ఉత్తీర్ణత సాధించిన గురుకులాలు
ఎంజేపీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ గురుకులాల్లో 92.92%
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో సంక్షేమ గురుకుల కాలేజీలు రికార్డు సాధించాయి. రాష్ట్ర సగటుకు మించిన ఉత్తీర్ణతతో ముందువరుసలో నిలిచాయి. సెకండియర్లో అత్యధికంగా ఎంజేపీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ విద్యార్థులు 92.92% ఉత్తీర్ణత సాధించారు. టీఆర్ఈఐఎస్ గురుకులాలు 92.5% ఉత్తీర్ణత సాధిం చాయి. తర్వాత గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. ఈసారి ఫలితాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు వెనుకబడ్డాయి.
25 కాలేజీల్లో వందశాతం ఉత్తీర్ణత
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తం గా 25 గురుకులాలు 100% ఉత్తీర్ణత సాధిం చాయి. ఇందులో 23 కాలేజీలు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్కు చెందినవే కావడం విశేషం. 100% ఉత్తీర్ణత సాధించిన వాటిలో సర్వేల్ (టీఆర్ఈఐఎస్), దౌలతాబాద్ (ఎంజేపీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్), టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ నుంచి ఆసిఫాబాద్, బోథ్, జైపూర్, కడెం, సిర్పూర్, కరీంనగర్, మడికొండ, ఘన్పూర్, పర్వతగిరి, జాఫర్గడ్, అన్నపురెడ్డిపల్లి, మహే ంద్రహిల్స్, హత్నూర, తోగుట, హత్నూర, కొండాపూర్, ధర్మారం, బ్రాహ్మణపల్లి (తాడ్వా యి), మఠంపల్లి, రాజాపేట, దేవరకొండ, నదిగూడెం, రామన్నపేట గురుకులాలున్నా యి. 100% ఉత్తీర్ణత కాలేజీల సిబ్బం దిని శాఖ కార్యదర్శులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మల్లయ్యభట్టు, శేషుకుమారి అభినందించారు.
శాఖల వారీగా గురుకుల కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం
మేనేజ్మెంట్ ఫస్టియర్ సెకండియర్
టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 76.03 87.12
టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ 73.30 87.50
టీఆర్ఈఐఎస్ 84.40 92.50
ఎంజేపీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ 75.47 92.92
ప్రభుత్వ కాలేజీలు 47.0 65.0
ఎయిడెడ్ 36.0 51.0
మోడల్ స్కూల్ 56.0 71.0