విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత

26 Nov, 2015 18:01 IST|Sakshi

శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నగరానికి చెందిన ఓ ప్రయాణికుడి తీరును అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అతడి వద్దనున్న టీవీ స్టాండ్‌లో అమర్చి 500 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు