ఏటూరునాగారానికి నిలిచిన రాకపోకలు

21 Jun, 2015 13:08 IST|Sakshi

వరంగల్: వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలకు పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ముల్లకట్టవద్ద ఆదివారం గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఏటూరునాగారం-తుపాకులగూడెం ప్రధాన రహదారిలో మాటుకుంట వాగు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా ప్రాంత వాసులు అవస్థలు పడుతున్నారు.

మరిన్ని వార్తలు