యాదాద్రికి పోటెత్తిన భక్తులు

10 Jul, 2016 09:21 IST|Sakshi

యాదాద్రి (నల్లగొండ) : యాదగిరిగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీనర్సింహ స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

మరిన్ని వార్తలు