‘గ్రూప్-2’పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

28 Feb, 2018 13:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 ఉద్యోగ నియామకాలపై ఉమ్మడి హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఓఎంఆర్‌ను రెండుసార్లు దిద్దినట్లు కనిపించినా, వైట్‌నర్ వాడినట్లు గుర్తించినా ఆ ఓఎంఆర్‌లను పరిశీలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓఎంఆర్ అన్సర్ షీట్ల పరిశీలనకు ముగ్గురు న్యాయవాదులను నియమించాలని సూచించింది. శని, ఆదివారాల్లో ఓఎంఆర్ ఆన్సర్ షీట్ల పరిశీలన జరుగుతుందని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా పడింది.

మరిన్ని వార్తలు