భార్యను కత్తితో పొడిచిన భర్త

22 Aug, 2015 00:00 IST|Sakshi

బాధితురాలికి తీవ్ర గాయాలు పరారీలో నిందితుడు
 
 జవహర్‌నగర్ : కుటుంబ కలహాలతో భార్యను భర్తే కత్తితో పొడిచాడు. ఈ సంఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాలిలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన లావణ్యకు గుంటూరు జిల్లా బాపట్ల వాసి శ్రీనివాస్‌తో 2008లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. అనంతరం హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. అప్పటి నుంచి జవహర్‌నగర్‌లోని జ్యోతికాలనీలో శ్రీసుజా గ్రామర్ స్కూర్ పేరుతో ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నారు. ప్రిన్సిపాల్‌గా భర్త, టీచర్‌గా భార్య విధులు నిర్వహిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం అదే పాఠశాలలో శ్రీనివాస్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోగా లావణ్య తీవ్రంగా ప్రతిఘటించింది. కాలనీవాసులతో చెప్పి ఆమెను పాఠశాల నుంచి బయటికి పంపించింది.

శ్రీనివాస్ మద్యానికి బానిసై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అతను శుక్రవారం పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం పాఠశాల నుంచి భార్య తిరిగి రాగా క్షణికావేశంతో ఇంట్లో ఉన్న కూరగాయల క త్తిని తీసుకుని పొడిచి పరారయ్యాడు. ఇది గమనించిన చుట్టుపక్కవారు బాధితురాలిని వెంటనే స్థానిక మీనాక్షి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాప్రా పరిధిలోని లైఫ్‌లైన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ వెంకటగిరి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు