విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నివాళులు అర్పించారు. పోలీసు అమరుల త్యాగానికి సార్థకత చేకూరాలని ఆయన అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటంలో పోలీసులదే ముఖ్యపాత్ర అని ఆయన చెప్పారు.
మంగళవారం నాడు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు పలువురు ఘనంగా నివాళులు అర్పించనున్నారు.