కొండా లక్ష్మణ్‌ బాపూజీకి కేసీఆర్‌ నివాళి

27 Sep, 2018 05:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి (సెప్టెంబర్‌ 27)ని పురస్కరించుకుని బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అందించిన నిస్వార్థ సేవలను కేసీఆర్‌ స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడైన బాపూజీ తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ సాధించడమే ఆయనకు అసలైన నివాళి అని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు