మద్యం లైసెన్సులు పొడిగింపు 

26 Sep, 2019 02:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వైన్‌షాపుల లైసెన్సులను నెలరోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎక్సైజ్‌ చట్టం–1969లోని సెక్షన్‌–17 ప్రకారం ప్రస్తుత షాపుల గడువును ఈ ఏడాది అక్టోబర్‌1 నుంచి 31 వరకు పొడిగిస్తున్నట్టు ఎక్సైజ్‌ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల రోజులకు గాను వార్షిక లైసెన్స్‌ ఫీజులో నెలకు సగటున అయ్యే మొత్తాన్ని ఫీజు కింద వసూలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.

ఈనెల రోజుల పాటు వైన్‌షాపుల యజమానులు కొనుగోలు చేసే మద్యంపై సాధారణంగా వర్తించే వ్యాట్‌తో పాటు టర్నోవర్‌ ట్యాక్స్‌ కింద 8% అదనపు పన్ను విధించనున్నట్టు వెల్లడించారు. ఏ4 షాపులకు వర్తించే అన్ని నిబంధనలు వైన్‌షాపులకు వర్తిస్తాయన్నారు. 2017–19 సంవత్సరాలకు గాను ఈనెల 30 తో పాత షాపుల గడువు ముగియనుండగా, అక్టోబర్‌ 1 నుంచి కొత్త మద్యం షాపులు ఏర్పాటు కావా ల్సింది.  2019–21 సంవత్సరాలకు గాను కొత్త పాలసీ విడుదలలో జరిగిన జాప్యం కారణంగా రెన్యూవల్‌ చేయాల్సి వచ్చింది. ఈ మేరకు ప్రతిపాదించిన ఫైలు సీఎం ఆమోదం పొందిందని, అధికారిక ఉత్త ర్వులు వెలువడటమే ఆలస్యమని మంగళవారం ‘సాక్షి’లో ‘మద్యం... పొడిగింపు తథ్యం’శీర్షికన కథనం ప్రచురించడం గమనార్హం.
 

>
మరిన్ని వార్తలు