టాటా వాహనాన్ని ఢీకొట్టిన ఇన్నోవా.. వ్యక్తి మృతి

9 Feb, 2015 15:59 IST|Sakshi

బాలానగర్ (మహబూబునగర్): వేగంగా వెళ్తున్న టాటా గూడ్స్ వాహనం అదుపుతప్పి ఒకరు మృతి చెందగా, 8 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబునగర్ జిల్లా బాలానగర్ మండలం రంగారెడ్డి గ్రామం సమీపంలో సోమవారం జరిగింది. వివరాలు.. షాద్‌నగర్ నుంచి జడ్చర్ల వె ళ్తున్న టాటా గూడ్స్ వాహనం బుస్సును ఓవర్‌టేకు చే యబోయింది. ఈ క్రమంలో బస్సును, కారును ఢీ కొంటు వెళ్లిన టాటా వాహనం ఢీవైడర్ దాటిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న ఇన్నోవా వాహనం టాటా వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో టాటా వాహనాన్ని నడుపుతున్న కొత్తకోట మండలం, కొన్నూరు గ్రామానికి చెందిన వాసుకి సుధాకర్(45) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో టాటా వాహనంలో ఉన్న 5గురు, ఇన్నోవాలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయాలైనవారిని షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు. సంఘనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు