బాయిలర్‌లో పడి వ్యక్తి మృతి

26 Nov, 2015 18:15 IST|Sakshi

మల్హర్ (కరీంనగర్) : డాంబర్ ప్లాంట్‌లో పని చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ బాయిలర్‌లో పడి మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొండంపేట గ్రామంలో గురువారం చోటుచేసకుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జుకల్ ఎర్రకుంటా గ్రామానికి చెందిన భద్రు(34) స్థానిక డాంబర్ ప్లాంట్‌లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం పని చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బాయిలర్‌లో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు కరీంనగర్‌కు బయలుదేరారు.

మరిన్ని వార్తలు