పంజగుట్టలో అందరూ చూస్తుండగానే..

20 Oct, 2019 11:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వ్యక్తిని దుండగులు కత్తులతో వెంటాడి హత్యచేసిన ఘటన పంజగుట్టలో జరిగింది. మూడు నెలల కిందట అన్వర్‌ అనే ఆటోడ్రైవర్‌ హత్య కేసులో నిందితుడు రియసత్‌ అలీని ఆదివారం ఉదయం మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా పంజగుట్ట ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు కత్తులతో వెంటాడి హత్య చేశారు. హత్య సమాచారం అందుకున్న క్లూస్‌ టీం, పంజగుట్ట పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అన్వర్‌ కేసులో ఏ1గా ఉన్న రియసత్‌ అలీ హత్య పాత కక్షల కారణంగానే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు