మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కవేలిలో సంఘటన
కోహీర్ : రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఏఎస్ఐ యూసుఫ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన రాయిగోని మహేష్ (22), పట్నం రాకేష్ అలియాస్ మధు(18), చాకలి శ్రీనివాస్ కవేలి క్రాస్రోడ్డు వైపు నుంచి మోటార్ సైకిల్పై స్వగ్రామమైన ఖానాపూర్ వెళ్తున్నారు. ఈ క్రమంలో బిలాల్పూర్ ప్రభుత్వ పశు వైద్యశాలలో లైవ్స్టాక్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఫయాజొద్దీన్ విధులు ముగిం చుకుని మోటార్ సైకిల్పై జహీరాబాద్ వెళ్తుండగా మార్గమధ్య కవేలి గ్రామంలో సాయిబాబా మందిరం ఎదుట ఎదురెదురుగా ఢీకొన్నారు.
ఈ సంఘటనలో మహేష్, రాకేష్ అక్కడికక్కడే మృతి చెందగా ఫయాజొద్దీన్, శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కోహీర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి ఉస్మానియాకు తరలిం చారు. మృతుడు మహేష్ హోట ల్ నడుపుతూ, వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహకరిస్తున్నాడు. రాకేష్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. జహీరాబాద్లోని ప్రైవేట్ కళాశాల లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా డు. కాగా ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తెలిపారు.
గ్రామంలో విషాదఛాయలు
గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడం, మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలు కావడంతో ఖానాపూర్లో విషాదఛాయలు నెలకొన్నాయి. గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.