వ్యక్తి అనుమానాస్పద మృతి

23 Apr, 2015 07:55 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని యాకుత్‌పూర సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. గురువారం ఉదయం రైల్వే ట్రాక్‌పై మృతదేహం ఉండటంతో స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

 

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు