ఖమ్మం టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్

11 Apr, 2015 14:05 IST|Sakshi

పినపాక: ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య కుటుంబాన్ని నారా లోకేశ్ శనివారం మధ్యాహ్నం పరామర్శించారు. తుళ్లూరు బ్రహ్మయ్య తండ్రి పుల్లయ్య 10 రోజుల క్రితం మరణించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ శనివారం ఖమ్మం జిల్లా అశ్వాపురంలోని బ్రహ్మయ్య ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుల్లయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన అనంతరం లోకేశ్ తిరుగు ప్రయాణం అయ్యారు.

మరిన్ని వార్తలు