లాక్డౌన్ వేళ వీధుల్లో ఆటలా?
దుమ్ము దులుపుతున్న సోషల్ మీడియా
సాక్షి, హైదరాబాద్: కరోనా విపత్తు సమయాన ఏపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మాస్క్ ధరించకుండా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తమ నివాసం వద్ద కుమారుడు దేవాన్ష్తో కలసి రోడ్డుపై చక్కర్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కరోనా వేళ ఇదేం చోద్యమంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి లాక్డౌన్ వేళ వీధుల్లో ఆటలా? అంటూ మండిపడుతున్నారు. చదవండి: ప్రజలంతా లాక్డౌన్ పాటిస్తుంటే ‘మాలోకం’ మాత్రం..
కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసిం ది. అయితే ఈ నిబంధనలను లోకేష్ ఉల్లంఘించి.. కుమారుడు దేవాన్ష్తో కలసి మాస్క్ లేకుండా కేర్లెస్గా సైకిల్ మీద రోడ్డుపై తిరుగాడడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. వారి వెంట ఉన్న సెక్యూరిటీకి చెందిన వ్యక్తి సైతం మాస్క్ ధరించగా.. లోకేష్ మాత్రం తనతోపాటు తన కుమా రుడు దేవాన్ష్కు కూడా మాస్క్ను ఉపయోగించకపోవడం గమనార్హం. చదవండి: రాష్ట్రంలో మరో 43 మందికి కరోనా