వచ్చేనెల 4నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ర్యాలీ

9 Jan, 2016 02:06 IST|Sakshi

నిజామాబాద్‌నాగారం : నిరుద్యోగ యువత కోసం ఆసక్తి ఉన్న వారికి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు స్టెప్ ఇన్‌చార్జి సీఈవో ముత్తెన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ర్యాలీ  ఫిబ్రవరి4నుంచి 13వరకు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఉంటుందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఈ నెల 19లోగా www.joinindianarmy.nic.in నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న వారికి అదే వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డు వస్తుందన్నారు.

మరిన్ని వార్తలు