చేటు తెచ్చిన చికెన్ ముక్క

28 Nov, 2014 03:46 IST|Sakshi

గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి
 తిమ్మాజీపేట: ఇష్టంగా తిన్న చికెన్ ముక్కే అతని ప్రాణాలను బలిగొంది. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం బావాజీపల్లిలో గురువారం జరిగిన ఈ సంఘటనతో కుటుంబం విషాదంలో మునిగింది. బావాజీపల్లి గ్రామానికి చెందిన కుర్వ మంగ శంకరయ్య(60) గురువారం చికెన్‌తో అన్నం తింటుండగా ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. కుటుంబ సభ్యులు నీళ్లు తాగించినా ఫలితం లేదు. వెంటనే అతడిని తిమ్మాజీపేటలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.

మరిన్ని వార్తలు