ఆటో బోల్తా : ఒకరి మృతి

16 Jun, 2015 14:41 IST|Sakshi

వీణవంక : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం మూలమలుపు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కొండపాక గ్రామ వాసి రాజయ్య(65) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో జమ్మికుంట నుంచి కొండపాకకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు