పోలీసు బందోబస్త్ మధ్య పైప్ లైన్ పనులు

6 Mar, 2015 13:23 IST|Sakshi

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్కు గోదావరి జలాలు తరలించేందుకు పైపులైన్ పనులు పోలీసుల సహాయంతో రెండోరోజు శుక్రవారం కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ పవర్ ప్లాంట్కు ఓ టీఎంసీ గోదావరి నీటిని తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో గందిపల్లి నుంచి పైపులైన్ పనులు ప్రారంభించగా గ్రామ రైతులు అడ్డుకున్నారు. అంతేకాకుండా పైపులైన్ కోసం తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో పోలీసుల సహాయంతో గురువారం పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు