పోలీసుల అదుపులో 50 మంది అనుమానితులు

18 Apr, 2015 07:47 IST|Sakshi

హైదరాబాద్: మోతీ ధర్వాజలోని ఐదు ప్రాంతాల్లో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో డీసీపీతో పాటు, 400మంది పోలీసులు పాల్గొన్నారు. సెర్చ్ లో భాగంగా పోలీసులు ఐదు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
50 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 44 వాహనాలను స్వాధీనం చేసుకొని, పలువురి పై కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు