-

రేషన్ సరుకుల స్వాధీనం

12 Sep, 2015 20:10 IST|Sakshi

సత్తుపల్లి(ఖమ్మం): రేషన్ సరుకులను అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో రంగంలోకి దిగిన పౌర సరఫరా అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 క్వింటాళ్ల బియ్యం, 1.40 క్వింటాళ్ల కందిపప్పు, ఒక క్వింటాల్ పంచదారను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో అక్రమ నిల్వలు ఉన్నాయనే సమాచారంతో పౌరసరఫరాల అధికారి డీటీ జగదీశ్ దాడులు నిర్వహించి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు