'జ్వరాలు అదుపు చేసేందుకే వైద్య శిబిరాలు'

12 Sep, 2015 19:48 IST|Sakshi

సత్తుపల్లి రూరల్ (ఖమ్మం) : జ్వరాలు వ్యాపించకుండా అదుపు చేసేందుకే అన్ని గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని సత్తుపల్లి క్లస్టర్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.భాస్కర్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్‌నగర్‌లో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. జ్వరపీడితుల నుంచి రక్తనమూనాలు సేకరించి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో గంగారం పీహెచ్‌సీ వైద్యాధికారిణి వైఎల్ ప్రశాంతి, హెచ్‌వీ అన్నమ్మ, హెచ్‌ఎస్ నర్సింహారావు, హెచ్‌ఈఈ శ్రీనివాస్, ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు