రెండురోజుల్లో పంపనున్న తెలంగాణ సర్కార్
సాక్షి, హైదరాబాద్: రుణాల రీ షెడ్యూల్కు సంబంధించి మరింత సమాచారం కావాలని రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం లేఖ రాసిందని తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ రాజీవ్శర్మ విలేకరులకు తెలిపారు. కరువు, వరదల వల్ల పంటలు దెబ్బతిన్న మండలాలు.. అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు ఏ విధంగా ఉన్నాయన్న వివరాలతో పాటు మరికొంత సమాచారం కోరిందన్నారు. ఆర్బీఐ లేఖకు బుధ,గురువారాల్లో సమాధానం పంపిస్తామన్నారు. ఈనెల 19వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి రాసిన లేఖలో.. గతప్రభుత్వం ప్రకటించిన మండలాలతోపాటు, తాజాగా 78 మండలాలను కూడా రుణాల రీ షెడ్యూల్ జాబితాలో చేర్చాలని కోరామన్నారు.