పింఛన్‌ వస్తుందా తాత..

3 Dec, 2019 12:20 IST|Sakshi
తుక్కుగూడలో బాలయ్యతో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

తుక్కుగూడ : తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సోమవారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై వెళ్తుండగా శ్రీశైలం జాతీయ రహదారిపై చిరు వ్యాపారం చేసుకుంటున్న కర్కాలపాడు గ్రామానికి చెందిన బాలయ్య కనిపించాడు. దీంతో మంత్రి సబితారెడ్డి హలో.. తాత బాగున్నావా అని పలకరించింది. వ్యాపారం ఎలా ఉంది ? కేసీఆర్‌ సార్‌ ఇచ్చే పింఛన్‌ వస్తుందా? అడిగి తెలుసుకున్నారు. దీనితో బాలయ్య అమ్మ నాకు పింఛన్‌ వస్తుందని మంత్రికి తెలిపాడు.

మరిన్ని వార్తలు