ఇండియా కొత్త మ్యాప్‌ల వినియోగంపై ఆదేశాలు

4 Dec, 2019 13:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన ఇండియా కొత్త మ్యాప్‌ను వినియోగించాలని ఆర్జేడీలు, డీఈవోలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఆదేశించింది. ఈ మేరకు సర్వే ఆఫ్‌ ఇండియా వెబ్‌సైట్‌ నుంచి మ్యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొంది. విద్యాశాఖ కార్యాలయాలతోపాటు అన్ని పాఠశాలల్లోనూ నూతన మ్యాప్‌ను ఉపయోగించాలని స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాల్లోనూ ఇదే మ్యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.  

మరిన్ని వార్తలు