కోల్సిటీ: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఓ సింగరేణి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 10 ఇంక్లయిన్ గనిలో ఎలక్ట్రిషియన్ హెల్పర్గా పని చేస్తున్న సమ్మయ్య (50) బుధవారం తెల్లవారుజామున ఇంటి వెనుక స్లాబ్కు ఉరేసుకుని ఉండగా స్తానికులు గుర్తించారు. మతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సమ్మయ్య కొంత కాలంగా మద్యానికి బానిస కాగా, కడుపునొప్పి, నడుమునొప్పి వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు.