రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నిరంజన్‌రెడ్డి

16 Dec, 2014 03:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదవుల పందేరాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వేగవంతం చేశారు. తాజాగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తికి చెందిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇక ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించాలని నిర్ణయించిన సీఎం ఇప్పటికే శ్రీనివాస్‌గౌడ్, జలగం వెంకట్రావును ప్రకటించగా... తాజాగా కోవ లక్ష్మి(ఆసిఫాబాద్), దాస్యం వినయ్‌భాస్కర్ (హన్మకొండ) పేర్లను ఖరారు చేశారు. మరో ఇద్దరి పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.  
 

>
మరిన్ని వార్తలు