‘కొత్త’ సవారీ...

2 Jan, 2016 02:20 IST|Sakshi
‘కొత్త’ సవారీ...

కొత్త సంవత్సర వేళ.. పోలీసులు భిన్నమైన, స్ఫూర్తివంతమైన నిర్ణయం తీసుకున్నారు. కాలుష్య నివారణకు, శారీరక దారుఢ్యానికి సైకిళ్ల వాడకంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు విధి నిర్వహణలో వీలును బట్టి సైకిళ్లను వాడాలని నిర్ణయించారు. ఈ మేరకు నర్సాపూర్, రామాయంపేట ఠాణాల్లో నాలుగు చొప్పున సైకిళ్లను కొన్నట్టు ఈ రెండు స్టేషన్ల సీఐలు తిరుపతిరాజు, నందీశ్వర్ తెలిపారు. శుక్రవారం వీటికి హత్నూరలోని పలుగుమీది పోచమ్మ ఆలయంలో పూజలు చేయించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు గోపినాథ్, లాలునాయక్, బాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
                                 - నర్సాపూర్
 

మరిన్ని వార్తలు