ప్రైవేటు కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

29 Jun, 2015 10:37 IST|Sakshi

రంగారెడ్డి: ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆదివారం రాత్రి జరిగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓంప్రకాశ్ (17) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం గుర్తించిన తోటి స్నేహితులు, కళాశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు