‘ఉత్తమ్‌ అన్నట్లు తెలంగాణ మా జాగీరే’

18 Apr, 2017 10:49 IST|Sakshi
‘ఉత్తమ్‌ అన్నట్లు తెలంగాణ మా జాగీరే’

కరీంనగర్‌: కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నట్లుగా తెలంగాణ జాగీరే తమదే అని, రాజకీయం చేయడం చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్‌ వాళ్లంటూ ఆయన విరుచుకుపడ్డారు. మతాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని తలసాని మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. బీజేపీ పుట్టినప్పటి నుంచే మత పిచ్చి ఉందని, దేశంలో నిజమైన హిందువు కేసీఆర్‌ తప్ప మరొకరు లేరని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి తలసాని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు