ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరాహార దీక్ష

21 Feb, 2017 13:54 IST|Sakshi

టేకులపల్లి:  తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఉపాధా​‍్యయ, ఉద్యోగ సంఘాలు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టాయి. కొత్త పెన్షన్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీంను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో బోడు రోడ్డు సెంటర్‌లో మంగళవారం ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. జెడ్పీటీసీ లక్కినేని సురేందర్, వైఎస్సార్ సీపీ, సీపీఐ, ఎన్డీ, పీడీఎస్యూ సంఘాల వారు సంఘీభావం తెలుపుతూ ఈ దీక్షలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు