'కాంగ్రెస్ పార్టీ బాధ్యతను విస్మరించింది'

2 Apr, 2016 17:44 IST|Sakshi

హైదరాబాద్ : ఇరిగేషన్ ప్రాజెక్టులపై నిర్మాణాత్మక సలహాలివ్వడంలో కాంగ్రెస్ పార్టీ  విఫలమైందని తెలంగాణ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. హైదరాబాద్లో శనివారం ఆయన మాట్లాడుతూ...అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై కాంగ్రెస్ పార్టీ బాధ్యతను విస్మరించి పారిపోయిందన్నారు. తమ్మిడిహెట్టి కంటే మేడిగడ్డ వద్దే ఎక్కువ నీటి లభ్యత ఉంటుందన్నారు. ప్రాజెక్టులపై వాస్తవాలను తెలుసుకోకుండా కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు