'బాబు నువ్వొద్దు.. రేవంత్ రెడ్డికివ్వు'

27 Apr, 2015 12:17 IST|Sakshi
'బాబు నువ్వొద్దు.. రేవంత్ రెడ్డికివ్వు'

హైదరాబాద్: తెలుగు దేశం పార్టీలో కలకలం రేగింది. తెలంగాణకు సంబంధించిన టీడీపీ పగ్గాలు ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డికి అప్పగించాలంటూ తెలుగు యువత పేరిట పోస్టర్లు వెలిశాయి. మహానాడులో ఈ మేరకు ప్రకటన చేయాలని తెలుగు యువత అందులో డిమాండ్ చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నోటీసు బోర్డుల్లో కనిపించిన ఈ ప్రకటనలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. తెలంగాణ టీడీపీ నాయకుల్లో కాస్తంత వాక్పటిమ ఉన్న వ్యక్తిగా రేవంత్ రెడ్డికి పేరున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారు డిమాండ్ చేసి ఉండొచ్చని, లేదా కావాలనే ఎవరో ఇలా చేసి ఉంటారని కూడా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు