అప్పులబాధతో రైతు ఆత్మహత్య

7 Jan, 2016 16:13 IST|Sakshi

వ్యవసాయంలో అప్పులపాలై మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గుడిహత్నూర్ మండలం గురుజ్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లేష్(50) అనే రైతు అప్పుల బాధతో బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి మల్లేష్‌ను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా..చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.


 

మరిన్ని వార్తలు