హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల షెడ్యూల్ కుదింపుపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల గడువును కుదిస్తు జారీ చేసిన జీవోను హైకోర్టు గురువారం కొట్టివేసింది. 15 రోజులకు కుదించాలన్న సర్కార్ నిర్ణయంపై న్యాయస్థానం స్టే విధించింది. ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీలోగా ఎన్నికల ప్ర్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.
కాగా శనివారంలోగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా హైకోర్టుకు వెల్లడించింది. విచారణ సందర్భంగా అధికారుల తీరును కోర్టు తప్పుబట్టింది. చట్టాన్ని సవరించే అధికారం శాసనసభకు తప్ప అధికారులు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా ఆదివారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. షెడ్యూల్ జారీ తర్వాత 31 రోజుల సమయం కావాలని పేర్కొంది.
ఈ సందర్భంగా న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మాట్లాడుతూ 'ఈ ప్రక్రియలో సెలవులను మినహాయించాల్సి ఉంటుంది. సెక్షన్ 33ని సవరించడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఈ రోజు నుంచి 45 రోజుల పాటు ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. శనివారంలోగా రిజర్వేషన్లు ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన అవకాశాలుండాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్ సదర్భంగా అందరి అభిప్రాయాలను కోర్టు మన్నించింది. శనివారం లేదా ఆదివారం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది' అన్నారు.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ గడువును కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిథర్ రెడ్డి స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిన పోరాట ఫలితం అయినా...ఇది ప్రజాస్వామ విజయంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ కుట్ర చేసిన విజయవంతంగా అడ్డుకోగలిగామని అన్నారు.
హైకోర్టు తీర్పు టీఆర్ఎస్కు చెంపపెట్టు
కోర్టు తీర్పు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలంటే టీఆర్ఎస్కు గౌరవం లేదని, ఎక్స్ అఫీషియో మెంబర్లను పెంచడంపై హైకోర్టుకు వెళతామన్నారు.
గ్రేటర్ ఎన్నికలపై తెలంగాణ సర్కార్కు షాక్
Published Thu, Jan 7 2016 4:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement