'ఎమ్మెల్సీ ఫలితాలతో ప్రజావ్యతిరేకత బట్టబయలు'

26 Mar, 2015 11:45 IST|Sakshi

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఫలితాలతో ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత బయటపడిందని టీటీడీపీ ఎమ్మెల్యే నరసారెడ్డి ఆరోపించారు. నిన్న లాబీల్లోకి రాకుండా ప్రభుత్వం తమను అడ్డుకుందని, ఈ రోజు అసెంబ్లీ గేటువద్దే అడ్డుకున్నారని, రేపు హైదరాబాద్ లో ఉండనిస్తారో లేదోనని టీటీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. గురువారం వారు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ...సస్పెండైన ఎమ్మెల్యేలు సభలోకి వెళ్లడానికి మాత్రమే వీళ్లేదని అసెంబ్లీ ప్రాంగణంలోకి రాకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సస్పెన్షన్ వ్యవహారంలో ప్రభుత్వ తీరు బాగోలేదన్నారు

మరిన్ని వార్తలు