హైదరాబాద్సిటీ: కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.4 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను, 6 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి.. దొంగలైన దేసేటి ఎల్లయ్య, పన్నీరు రమేశ్ వివరాలను తెలిపారు.