ఇద్దరు విద్యార్థులు అదృశ్యం

15 Dec, 2015 20:28 IST|Sakshi

హైదరాబాద్‌ : చింతల్‌లో ఇద్దరు విద్యార్ధులు అదృశ్యమయ్యారు. చింతల్ గౌతమి టెక్నో స్కూల్లో 9వ తరగతి చదువుతున్న డి.ప్రీతి(16), పి.ప్రేమ్(15) అనే విద్యార్థినీ విద్యార్థులు సోమవారం సాయంత్రం నుంచి కనపడుటలేదు. సోమవారం స్కూలుకు వెళ్లిన వారు రాత్రైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు