కాళేశ్వరానికి జాతీయ హోదా ఎలా ఇస్తారు?

21 Nov, 2019 13:45 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

సాక్షి, కొల్లాపూర్‌: డీపీఆర్‌ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని, దానికి జాతీయ హోదా ఎలా ఇస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రశ్నించారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో గాంధీ సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. సోమశిల–సిద్దేశ్వరం వంతెనతో పాటు జాతీయ రహదారి నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.  

మరిన్ని వార్తలు