వివాహిత ఆత్మహత్య

19 Jan, 2016 20:35 IST|Sakshi

సిద్దిపేట (మెదక్) : భర్త వేధింపులు తాళలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న వివాహిత చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు మృతదేహాన్ని భర్త ఇంటి ముందు ఉంచి అతనికి దేహశుద్ధి  చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా సిద్దిపేట గణేష్‌నగర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఉమేష్‌కు రెండేళ్ల క్రితం సరితతో వివాహమైంది.

అప్పటి నుంచి వేధింపులకు గురిచేస్తుండటంతో.. సరిత వారం రోజుల క్రితం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఆగ్రహించిన ఆమె బంధువులు మృతదేహాన్ని ఉమేష్ ఇంటి ముందు ఉంచి అతన్ని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు