నగల కోసం గొంతు కోశారు..

19 Jan, 2016 19:35 IST|Sakshi

సదాశివపేట (మెదక్) : ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతుకోసి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ సంఘటన మెదక్ జిల్లా సదాశివపేట మండలం సిద్ధాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షాహిద అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమెను గొంతుకోసి హత్య చేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు