తేలుకాటుతో యువకుడు మృతి

18 Sep, 2015 11:34 IST|Sakshi

నల్లగొండ: వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో తేలు కుట్టిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉపేందర్ వ్యవసాయ, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం పనిచేసుకుంటున్న సమయంలో తేలు కుట్టడంతో.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉపేందర్ గురువారం రాత్రి మృతిచెందాడు.
 

మరిన్ని వార్తలు